VZM: అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్త ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరగడం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక కొత్త యుగానికి నాంది అని ఎమ్మెల్యే లలిత కుమారి పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్టుతో ఆ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.