ADB: ఇచ్చోడ మండలంతో పాటు పరిసర ప్రాంతాలకు ఈనెల 28 నుంచి 30 వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మాడేగాం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద నిర్వహణ పనులు, సీతాగొంది వద్ద పైపులైన్ మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం కలగనుంది. మూడు రోజుల పాటు నీటి సరఫరా ఉండదని, ప్రజలు గమనించి సహకరించాలని భగీరథ నిర్వహణాధికారి తెలిపారు.