AP: మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధితులకు అందుతున్న వైద్యసహాయాన్ని పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు సూచించారు.