ELR: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంపై విధించిన పెనాల్టీలను రద్దు చేయాలని కోరుతూ ఫ్యాప్టో నాయకులు గురువారం డీఈవో ఎం. వెంకటలక్ష్మమ్మకు వినతిపత్రం అందజేశారు. పెనాల్టీల భయంతో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, దీనివల్ల మూల్యాంకన నాణ్యత దెబ్బతినే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిడి రహిత వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
KRNL: దేవనకొండ మండలం పాలకుర్తి గ్రామ సమీపంలో లక్కందిన్నె రోడ్డువైపు గడ్డివాముల వద్ద గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. హరిజన పెద్దయ్యకు చెందిన ఐదు గడ్డివాములు, వెంకన్నకు చెందిన పశువుల పాక, వ్యవసాయ సామగ్రి కాలిపోయాయి. స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 4 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.
VZM: బోర్డు ఆఫ్ విజిటర్స్ కమిటీ సభ్యులు గురువారం బొబ్బిలి సబ్ జైలును సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఖైదీలతో ADJ జడ్జి ఎస్.దామోదరరావు, జిల్లా లీగల్ సర్వీస్ సెక్రటరీ కృష్ణప్రసాద్, బొబ్బిలి జడ్జిలు వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ.. ఖైదీల్లో సత్ప్రవర్తన రావాలని కోరారు. తెలిసి తెలియక చేసిన తప్పులను సరి చేసుకోవాలని సూచించారు.
CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ వీరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా నవధాన్యాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించింది. ఉదయాపూర్వమే అర్చకులు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత నవధాన్యాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.
TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తుడు పోగొట్టుకున్న నగదును ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ నిజాయతీగా తిరిగి అప్పగించారు. అమ్మవారు ఆలయ మహాద్వారం సెక్యూరిటీ స్కాన్ వద్ద చెన్నైకి చెందిన తులసి దాస్ భక్తుడు నగదు బ్యాగును పోగొట్టుకున్నారు. దానిని కానిస్టేబుల్ రమేశ్ గుర్తించి, బ్యాగులోని గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ భక్తుడికి అందజేశారు.
NLR: టీడీపీ సీనియర్ నేత కొండూరు సుధాకర్ రెడ్డి గురువారం రాత్రి చెన్నైలో మృతి చెందారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామానికి చెందిన ఆయన అస్వస్థతతో చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయన గంగపట్నం ఆలయ ఛైర్మన్గా పనిచేశారు. ఆయన మృతి పట్ల కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సంతాపం తెలిపారు. శుక్రవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు చెప్పారు.
ATP: గుత్తి పట్టణంలోని ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ సమీపంలో గల పాల డైరీలో శుక్రవారం తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు. పాల డైరీ తాళాలు పగలగొట్టి క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.10వేల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
SS: హిందూపురం పట్టణంలో పోలీసులు గురువారం రాత్రి నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో నిఘా నిర్వహించారు. డీఎస్పీ మహేష్ నేతృత్వంలో అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ మద్యపానం, అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. తిలక్ నగర్, మోడల్ కాలనీ వంటి ప్రధాన ప్రాంతాల్లో సీఐ జనార్ధన్ ఆధునిక సాంకేతికతతో తనిఖీలు చేశారు.
కోనసీమ: ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్వో ఉదయ్ భాస్కర్ హెచ్చరించారు. గురువారం ఆయన జిల్లాలోని పలు ఏజెన్సీల్లో అమ్మకాలను పరిశీలించారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదన్నారు. ఏజెన్సీలకు పూర్తి స్థాయిలో సరఫరా జరుగుతోందన్నారు. గ్యాస్ బుకింగ్, సరఫరాలో ఇబ్బందులు ఉంటే 94416 92275 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
KKD: అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.19.55 కోట్లు సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 13 సార్లు హుండీలను తెరచి లెక్కించారు. గతేడాది జూన్, నవంబరు, డిసెంబరు మాసాల్లో అత్యధిక ఆదాయం వచ్చింది. రోజు సరాసరి హుండీల ద్వారా రూ.5.35 లక్షలు ఆదాయం సమకూరిందని ఛైర్మన్ రోహిత్, ఈవో త్రినాధరావు తెలిపారు.
PPM: జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో ఉన్న పలు పాఠశాలల విద్యార్థులకు పోలీసు చట్టాలపై గురువారం అవగాహన కల్పించారు. ఆనంతరం పోలీసు చట్టాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలలో తమ అభిప్రాయాలను చిత్రాల రూపంలో నిక్షిప్తం చేశారు. గెలిచిన విదార్థులకు పట్టణ సీఐ వెంకటరావు బహుమతులు ప్రధానం చేశారు.
అనకాపల్లి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు గురువారం జరిగాయి. అధ్యక్షుడిగా వడ్డాది వెంకట్రావు, ఉపాధ్యక్షుడిగా దివాకర్, ప్రధాన కార్యదర్శిగా శివాచారి, సంయుక్త కార్యదర్శిగా సందీప్ ఎన్నికయ్యారు. అలాగే కోశాధికారిగా నీలవేణి, గ్రంథాలయ కార్యదర్శిగా మోహన్, స్పోర్ట్స్ సెక్రటరీగా యోగి, మహిళా రిప్రజెంటేటివ్గా కుసుమను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారిని స్థానికులు అభినందించారు.
VZM: జిల్లాలోని అక్రిడేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈ నెల 28 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు పి. గోవిందరాజులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
SKLM: అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని బుధవారం రాత్రి జలుమూరులోని చల్లవాని పేట వద్ద పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బలద సంత నుంచి నారాయణ వలసకు 6 ఎద్దులతో వస్తున్న బొలెరో వాహనాన్ని గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. ఇద్దరి వ్యక్తులపై గురువారం కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై బి. అశోక్ బాబు పేర్కొన్నారు. పశువులను అక్రమంగా రవాణా చేయకూడదన్నారు.
విజయవాడ పోలీసులు అంతర్రాష్ట్ర దొంగ ఆరేపల్లి దుర్గారావును అరెస్ట్ చేశారు. మచిలీపట్నానికి చెందిన అతనిపై 80 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇటీవల పలు ప్రాంతాల్లో చోరీలు చేయడంతో నిఘా పెట్టి పట్టుకున్నామన్నారు. అతని వద్ద నుంచి రూ.3.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.