VZM: జిల్లాలోని అక్రిడేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈ నెల 28 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు పి. గోవిందరాజులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.