NGKL: తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ వద్ద వనపర్తి డిపో ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొన్న ప్రమాదంలో దాసర్ల తిరుపతయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.