VZM: వాహన నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలని SI రమేశ్ కోరారు. బొబ్బిలి పట్టణంలోని పాత డంపింగ్ యార్డు వద్ద ఆదివారం వాహనాలను తనిఖీ చేసి పాత చలానాలను కట్టించారు. వాహన నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు పాటించాలని వాహనదారులను కోరారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్ బాలురలకు వాహనాలు ఇవ్వవద్దన్నారు.