MDK: పెద్ద శంకరంపేటలో శ్రీరామనవమి ఉత్సవాలు పురస్కరించుకుని సోమవారం ఉదయం శ్రీ సీతారాముల పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాల ఉంచి వీరబ్రహ్మణ పండితుల మంత్రొచ్చరణలతో పూజలు చేశారు. రామాలయం నుంచి ప్రారంభమైన పల్లకి సేవ పట్టణ పురవీధుల గుండా ఊరేగించగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు