KNR: తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శ్రీమల్లికార్జున స్వామి బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో తరలివచ్చి శ్రీమల్లికార్జున స్వామి సమేత అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల ఊరేగింపులో శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో గ్రామపెద్దలు, కుల సంఘాల వారు పాల్గొన్నారు.