కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలు RCM చర్చిలో మ్రాని కొమ్మల ఆదివారాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తేలప్రోలు గ్రామపురి వీధుల్లో ఫాదర్ గోళ్ల విజయ కుమార్ ఆధ్వర్యంలో క్రైస్తవులు మట్టలు పట్టుకుని యేసు క్రీస్తు కీర్తనలు పాడుతూ ప్రదక్షిణగా చర్చిలోకి ప్రవేశించారు. అనంతరం ఫాదర్ విజయ కుమార్ యేసుప్రభు పడిన శ్రమలను విశ్వాసులకు వివరించారు.