CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ వీరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా నవధాన్యాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించింది. ఉదయాపూర్వమే అర్చకులు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత నవధాన్యాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.