ELR: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంపై విధించిన పెనాల్టీలను రద్దు చేయాలని కోరుతూ ఫ్యాప్టో నాయకులు గురువారం డీఈవో ఎం. వెంకటలక్ష్మమ్మకు వినతిపత్రం అందజేశారు. పెనాల్టీల భయంతో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, దీనివల్ల మూల్యాంకన నాణ్యత దెబ్బతినే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిడి రహిత వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.