కోనసీమ: ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్వో ఉదయ్ భాస్కర్ హెచ్చరించారు. గురువారం ఆయన జిల్లాలోని పలు ఏజెన్సీల్లో అమ్మకాలను పరిశీలించారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదన్నారు. ఏజెన్సీలకు పూర్తి స్థాయిలో సరఫరా జరుగుతోందన్నారు. గ్యాస్ బుకింగ్, సరఫరాలో ఇబ్బందులు ఉంటే 94416 92275 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.