NZB: సిరికొండ మండలంలో డిజిటల్ క్రాప్ సర్వే, డీసీఎస్ యాప్లో 80 శాతం సర్వే పూర్తి అయ్యిందని మండల వ్యవసాయ అధికారి నర్సయ్య తెలిపారు. 2025-2026లో రైతు పంటల వారీగా సాగు విస్తీర్ణం వివరాలు డీసీఎస్ యాప్లో నమోదు చేస్తున్నట్లు చెప్పారు.18 మంది వాలెంటీర్ల ద్వారా నమోదు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో ఐదు రోజుల్లో సర్వే పూర్తి చేస్తామని ఆదివారం వెల్లడించారు.