విజయవాడ పోలీసులు అంతర్రాష్ట్ర దొంగ ఆరేపల్లి దుర్గారావును అరెస్ట్ చేశారు. మచిలీపట్నానికి చెందిన అతనిపై 80 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇటీవల పలు ప్రాంతాల్లో చోరీలు చేయడంతో నిఘా పెట్టి పట్టుకున్నామన్నారు. అతని వద్ద నుంచి రూ.3.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.