NDL: మార్కాపురం జిల్లాలో ఇవాళ జరిగిన బస్సు, టిప్పర్ ప్రమాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సు మంటల్లో చిక్కుకుని పదిమంది ప్రయాణికులు సజీవ దహనం కావడంపై ఆయన ఆవేదన చెందారు. మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.