NLR: మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ స్పందించారు. మోటు చింతల పాలేనికి చెందిన కొండయ్య భార్య, ఇద్దరు పిల్లలు ఆ బస్సులో ఉన్నారని తెలియడంతో ఎమ్మెల్యే కొండయ్యకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. తన కుటుంబ సభ్యులు క్షేమంగానే ఉన్నారని కొండయ్య చెప్పారు. బాధితులకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.