ఉమ్మడి జిల్లాలో కోడిగుడ్డు ధరలు పడిపోవడంతో పౌల్ట్రీ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరిలో రూ.7 ఉన్న గుడ్డు ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 4 నుంచి రూ. 4.5కు తగ్గిందని వారు తెలిపారు. చికెన్ ధరలు పెరిగినా, ఎగుమతులు తగ్గిపోవడం వల్ల గుడ్లకు డిమాండ్ పడిపోయి భారీ నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు చెప్పుకొచ్చారు.