NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన జోగు ప్రణీత కల్వకుర్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతుంది. ఆమె తండ్రి ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. విషయం తెలుసుకున్న ఓ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు దారమొని గణేష్ గురువారం స్కూల్ యజమాన్యానికి రూ. 15 వేల ఫీజు చెల్లించారు. కార్యక్రమంలో తోటపల్లి గ్రామ ఉప సర్పంచ్ భీమయ్య, జోగు సత్యనారాయణ పాల్గొన్నారు.