NDL: బేతంచెర్ల మండలం బలపాలపల్లిలో శ్రీరామనవమి సందర్భంగా మండల స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో సిమెంట్ నగర్ జట్టు ప్రథమ, బలపాలపల్లి జట్టు ద్వితీయ, బేతంచెర్ల జట్టు తృతీయ స్థానాలు సాధించాయి. విజేతలకు పోలూరు సోదరులు, ఉన్నం సుధాకర్, జీవన్ చౌదరి రూ.20,000, రూ.10,000, రూ.5,000 బహుమతులు అందజేశారు.