NTR: వీరులపాడు మండల మహిళా సమైఖ్య ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి డ్వాక్రా మహిళలకు చెక్కులను అందజేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, వివిధ పథకాల ద్వారా మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు.