W.G: పాలకోడేరు(మం) గరగపర్రు గ్రామంలో పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందజేసే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆయనతో పాటు అధికారులు, రైతులు, కూటమి నేతలు ఉన్నారు.