• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఏటీఎంల వద్ద మోసాలపై ఎస్పీ హెచ్చరిక

కర్నూలు జిల్లాలో ఏటీఎం కేంద్రాల వద్ద అపరిచితుల మాటలు నమ్మి డబ్బులు ఇవ్వొద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం హెచ్చరించారు. అత్యవసరం పేరుతో నగదు తీసుకుని ఫోన్‌పే, గూగుల్ పే చేశామని చూపిస్తూ మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. డబ్బులు ఖాతాలో జమ కాకపోవడం లేదా హోల్డ్‌లో పడిపోవడం వల్ల నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.

April 5, 2026 / 09:05 AM IST

జువ్వలదిన్నెపై వైసీపీ నీచ రాజకీయాలు: మంత్రి

అన్నమయ్య: జువ్వలదిన్నెలో రూ.45 కోట్లతో ఆటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్ ఏర్పాటు చేసి 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఫిషింగ్ హార్బర్ అభివృద్ధితో 25 వేల మత్స్యకార కుటుంబాలకు లాభం చేకూరుతుందని, అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోందని విమర్శించారు. షిప్‌బిల్డింగ్, మెరైన్ ఇంజినీరింగ్ రంగాల్లో యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయని అన్నారు.

April 5, 2026 / 09:04 AM IST

జిల్లాకు నేడు, రేపు మినిస్టర్ రాక

SKLM: రాష్ట్ర రహదారులు, భవనాలు(R&B) శాఖా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈనెల 5, 6వ తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రి 5న జిల్లాకు వస్తారని చెప్పారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ప సమీక్షా సమావేశం 6న నిర్వహిస్తారన్నారు.

April 5, 2026 / 09:03 AM IST

మురుగు నీటితో పెరిగిన పందుల బెడద..!

VZM: రాజాం పట్టణంలో పందుల బెడద తీవ్రంగా మారింది. సత్యనారాయణపురం, ఆదర్శనగర్, మెంతిపేట కాలనీల్లో మురుగు నీరు నిల్వ ఉండటంతో పందులు విపరీతంగా సంచరిస్తున్నాయి. ఇళ్లలోకే ప్రవేశిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యాధుల ముప్పు పెరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు.

April 5, 2026 / 09:01 AM IST

రేపు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

ATP: CM చంద్రబాబు రేపు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్‌ను కలెక్టర్ ఆనంద్ విడుదల చేశారు. ఉ.11:10కు యాడికి మండలం వేములపాడు చేరుకోనున్న సీఎం, మార్కెట్ యార్డ్‌లో నిర్వహించే ‘ప్రజా వేదిక’ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం పెండేకల్లు రిజర్వాయర్ తీర ప్రాంతాన్ని సందర్శించి నీటి సంరక్షణ పనులను పరిశీలిస్తారు. తర్వాత టీడీపీ కార్యకర్తలతో భేటే అవుతారు.

April 5, 2026 / 09:01 AM IST

అదుపు తప్పి బస్సు బోల్తా

NLR: జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగం మండలం కోలగట్ల సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతపురం డిపోకు చెందిన ఈ బస్సు నెల్లూరు వైపు ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న ఒక లారీని తప్పించబోయి నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు.

April 5, 2026 / 09:01 AM IST

తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంత ఎంతంటే?

E.G: రాజమండ్రి మార్కెట్‌లో ఆదివారం చికెన్ ధరలు తగ్గి ప్రజలకు ఊరట కలిగించాయి. గత వారం కంటే రేట్లు తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.300, స్కిన్‌తో రూ.280, లైవ్ కోడి రూ.180గా విక్రయిస్తున్నారు. మటన్ ధర మాత్రం కిలో రూ.1000గా కొనసాగుతోంది. ధరలు తగ్గడంతో మాంసం దుకాణాలు వినియోగదారులతో సందడిగా మారాయి.

April 5, 2026 / 09:00 AM IST

గోవాడ షుగర్ ఫ్యాక్టరీపై అమర్నాథ్ విమర్శలు

AKP: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం ఆరోపించారు. చోడవరం నియోజకవర్గ సర్పంచ్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు త్వరలో కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు. రైతుల బకాయిల చెల్లింపు, కార్మికుల రక్షణ కోసం వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

April 5, 2026 / 09:00 AM IST

వైసీపీకి ప్రజలు చెప్పిన బుద్ధి సరిపోదు: ఎమ్మెల్యే

KKD: ఏపీ రాజధానిగా అమరావతిపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు కేవలం ఒక్క YCP మాత్రమే వ్యతిరేకించిందని జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూ విమర్శించారు. శనివారం కాకినాడ TDP కార్యాలయంలో బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. YCPకి రాష్ట్రం పట్ల విశ్వాసం లేదని, ప్రజలు చెప్పిన బుద్ధి సరిపోదని ఆరోపించారు. ఆంధ్రుల ఆకాంక్షను పార్లమెంటు గౌరవించిందన్నారు.  

April 5, 2026 / 09:00 AM IST

అమరావతికి సంఘీభావంగా దీపాలు వెలిగించిన టీడీపీ నేతలు

W.G: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు అమరావతి బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం చినతాడేపల్లి గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షులు పరిమి రవికుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ముందు దీపాలు వెలిగించి అమరావతి రాజధానికి సంఘీభావం తెలియచేయడం జరిగింది. ఇదే రీతిలో పలువురు టీడీపీ నాయకులు తమ తమ గ్రామాల్లో కుటుంబ సభ్యులతో దీపాలు వెలిగించారు.

April 5, 2026 / 09:00 AM IST

రెవెన్యూ గ్రామసభ నిర్వహించిన మార్కాపురం MRO

ప్రకాశం: మార్కాపురం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వెబ్ ల్యాండ్ అడంగల్లో ఇతరులు’ అని నమోదైన భూములను పరిశీలించి వాస్తవ పట్టాదారుల పేర్లను నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైందని MRO చిరంజీవి తెలిపారు .మార్కాపురం మండలం ఈడుపూరు రెవెన్యూ పరిధిలోని రాజుపాలెం గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో 32 మంది రైతులు తమ భూములకు సంబంధించిన దస్తావేజాలతో పేరు మార్పిడి కోసం అర్జీ సమర్పించారు.

April 5, 2026 / 08:47 AM IST

అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

గుంటూరు: తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. త్రీ టౌన్ సీఐ సాంబశివరావు సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని గుర్తించి బ్రీత్ అనలైజర్ టెస్టులు చేశారు. మద్యం తాగి ఆటోలు, ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ఐదుగురిని గుర్తించి కేసులు నమోదు చేశారు.

April 5, 2026 / 08:45 AM IST

కడివెళ్లలో గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు

KRNL: కడివెళ్ల గ్రామంలో బిందెడు నీటికి ప్రజలు తీవ్ర అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామానికి తాగునీటి అందించాలని ఎస్.నాగాలపురం గ్రామం నుంచి పైపులైన్లు వేసినా సక్రమంగా నీటిని సరఫరా చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులకొకసారి, కొన్ని సార్లు వారం అయినా నీటి సరఫరా జరగడం లేదని, దీంతో గుక్కెడు నీటికి నిత్యం యుద్ధం చేయాల్సి వస్తుందన్నారు.

April 5, 2026 / 08:43 AM IST

మునగపాక తహసీల్దారిగా బాధ్యతలు స్వీకరణ

AKP: మునగపాక తహసిల్దార్‌గా పీవీ రత్నం శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన పి. సత్యనారాయణ రాంబిల్లి తహసీల్దారుగా డిప్యూటేషన్ పై వెళ్లారు. ఈయన స్థానంలో బాధ్యతలు స్వీకరించిన రత్నం మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. రైతులు తమ సమస్యలపై నేరుగా తనను సంప్రదించవచ్చని అన్నారు.

April 5, 2026 / 08:43 AM IST

మేజర్ పంచాయతీ ప్రత్యేక అధికారిగా రమణయ్య

VZM: కొత్తవలస మేజర్ పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఎస్.రమణయ్య శనివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ మేరకు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సర్పంచుల పదవి కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎండివో గా విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బందికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

April 5, 2026 / 08:43 AM IST