VZM: కొత్తవలస మేజర్ పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఎస్.రమణయ్య శనివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ మేరకు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సర్పంచుల పదవి కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎండివో గా విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బందికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.