E.G: రాజమండ్రి మార్కెట్లో ఆదివారం చికెన్ ధరలు తగ్గి ప్రజలకు ఊరట కలిగించాయి. గత వారం కంటే రేట్లు తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.300, స్కిన్తో రూ.280, లైవ్ కోడి రూ.180గా విక్రయిస్తున్నారు. మటన్ ధర మాత్రం కిలో రూ.1000గా కొనసాగుతోంది. ధరలు తగ్గడంతో మాంసం దుకాణాలు వినియోగదారులతో సందడిగా మారాయి.