కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషన్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ వేడుకకు హాజరు కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆహ్వాన పత్రిక ఇచ్చి మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు ఆయన పేర్కొన్నారు.