W.G: ఉండి మండలం వెలివర్రులో శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయంలో సీతారామ కళ్యాణం శుక్రవారం రంగరంగ వైభవంగా జరిగింది. పీటల మీద మంతెన రంగరాజు, త్రివేణి దంపతులు కూర్చున్నారు. మండలంలో చెరుకువాడ, ఉండి, కొలమూరు, కలిసిపూడి, యండగండి తదితర గ్రామాలల్లో కళ్యాణం జరిగింది. చలివిడి, వడపప్పు, పానకం ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.