GNTR: మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ మళ్లీ సొంత గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో సమావేశమయ్యారు. జనసేనలో కీలక నేతగా ఉన్న ఆయన గతంలో బీఆర్ఎస్లో చేరారు. పవన్తో తాజా భేటీతో ఆయన తిరిగి జనసేనలో చేరడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే ఆయన అధికారికంగా పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
GNTR: ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా తెనాలి మండలం పెదరావూరు జడ్పీ స్కూల్ డ్రాయింగ్ టీచర్ వెంకటకృష్ణ (కృష్ణశ్రీ) వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఏ3 షీట్పై ‘ప్రపంచ కళా దినోత్సవం’ అనే అక్షరాలతోనే ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ చిత్రాన్ని కలర్ పెన్లతో అద్భుతంగా గీశారు. కాగా, లియోనార్డో డా విన్సీ జయంతిని ఏటా ఈ దినోత్సవంగా జరుపుకుంటారు.
VSP: విశాఖలోని ఇందిర గాంధీ జూపార్కులో ‘లియో’ అనే 7 సంవత్సరాల మగ ఆసియాటిక్ సింహం మంగళవారం మృతి చెందింది. అస్సాం నుంచి జంతు మార్పిడి కార్యక్రమం ద్వారా తీసుకువచ్చిన ఈ సింహం క్వారంటైన్లో ఉండగా అనారోగ్యానికి గురైంది. మార్చి 19న పరీక్షల్లో ట్రైపానోసోమియాసిస్, ఎర్లిచియోసిస్ అనే రక్త సంబంధిత వ్యాధులు ఉన్నట్లు తేలింది. దీంతో అవయవాలు పనిచేయక చనిపోయింది.
TPT: తిరుపతి స్విమ్స్ అన్న క్యాంటీన్ వద్ద ఓ వ్యక్తి చనిపోయి ఉండటాన్ని పోలీసులు బుధవారం గుర్తించారు. మృతుని జేబులో లభించిన వికలాంగుల ఆర్టీసీ బస్సు పాస్ ఆధారంగా అతను అన్నమయ్య జిల్లా గాలివీడు ప్రాంతానికి చెందిన పి.పెంచలయ్యగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. ఎవరైనా గుర్తిస్తే తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ను సంప్దించాలని పోలీసులు కోరారు.
E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామ పంచాయతిలో రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి శివసత్య ప్రసాద్ బుధవారం ‘మాట – మంతి’ నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. కార్మికుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెంలో ఈరోజు ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన దెయ్యాల సూర్యనారాయణ అనే వ్యక్తి తన ఇంటిలో నిద్రిస్తుండగా, ఉదయం 6 గంటలకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గోడ దూకి కత్తితో హత్యచేసి పరారయ్యాడు. రూరల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ASR: డుంబ్రిగుడ మండలంలోని కించుమండ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. మూడేళ్ల క్రితం ప్రారంభమైన పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. పూర్తిస్థాయి ప్రహరీ లేకపోవడంతో బయట వ్యక్తులు, మూగజీవాలు లోపలకు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు తెలిపారు.
BPT: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని అద్దంకి నియోజకవర్గ YCP సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టు రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమేనని మండిపడ్డారు.
ప్రకాశం: మర్రిపూడి మండలం సంగమేశ్వరం నుంచి వచ్చే త్రాగునీరు గత రెండు నెలలుగా విడుదల చేయకపోవడంతో పది గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈస్కీమ్ దర్శికి చెందిన ఓ వ్యక్తి టెండర్ దక్కించుకోగా లీజు కింద మరో యువకుడికి అప్పగించాడు. గత 14 నెలలుగా తనకు బిల్లులు రాలేదని స్కీమును నడపకుండా ఆపివేశాడు. దీంతో మంచి నీరు లేక 10 గ్రామాల ప్రజలు దాహంతో కేకలు పెడుతున్నారు.
ATP: గుత్తి విద్యుత్ డివిజన్ పరిధిలోని sc,st నివాస గృహాలపై సౌర విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఈఈ పద్మనాభ పిల్లే బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజనల్ పరిధిలోని పట్టణాలు, మండల కేంద్రాలలో ఎస్సీ, ఎస్టీ నివాస గృహాలపై సోలార్ ప్యానల్ను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఎస్సీ,ఎస్టీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కోనసీమ: సఖినేటిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన రూరల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ కేంద్రంలో బుధవారం ఉచిత మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు హరీష్ రెడ్డి బిసం తెలిపారు. ఆయుర్వేదం, అల్లోపతితో పాటు ఏఐ వంటి నూతన విధానంలో రోగులకు పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
KDP: మాజీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డిని దువ్వూరు మండల వైసీపీ కన్వీనర్ ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని పార్టీ పరిస్థితులను శంకర్ రెడ్డి వివరించారు. కార్యకర్తలతో సమన్వయం పెంచుతూ పార్టీని బలోపేతం చేయాలని జగన్ సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.
TPT: మాజీ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ మంగళవారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద సూపరింటెండెంట్ రమేశ్, ఏవిఎస్వో రాధాకృష్ణ ఆమెకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న మిథాలి రాజ్కు అర్చకులు ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయాధికారులు ఆమెకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
NLR: మంత్రి లోకేష్ ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (NUDA) ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు ఆయన హాజరుకానున్నట్లు కూటమి నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకేష్తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నట్లు వెల్లడించారు.
CTR: పూతలపట్టులో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 9మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ గోపి తెలిపారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో మెరుపు దాడి చేసి 9 మందికి బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేసి వారి అడ్రస్లు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.