• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అల్లనేరేడు తోటలో అగ్ని ప్రమాదం

CTR: పుంగనూరు మండలం పట్రపల్లి గ్రామ సమీపంలో అల్లనేరేడు తోటలో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 1,50,000 డ్రిప్ పైపులు, కేబుల్స్ కాలిపోయి నష్టం వాటిల్లినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు.

February 25, 2026 / 03:23 PM IST

చట్టాలను మరింత పటిష్టంగా చేయాలి: కమిషనర్

NLR: మహిళలు పని చేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం- 2013 మరింత పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. బుధవారం నెల్లూరు తిక్కన ప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. 10 మంది పైన మహిళా ఉద్యోగులు పని చేస్తున్న చోట ఐ.సి.సి ఏర్పాటు చేయాలని ఆమె స్పష్టం చేశారు.

February 25, 2026 / 03:22 PM IST

సీఎం పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు

VZM: ఈనెల 28వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు చీపురుపల్లి మండలం రావివలస వద్ద పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రానున్వారు. ఈ నేపథ్యంలో బుధవారం సభా స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి పరిశీలించి, పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేదిక నిర్మాణం, పార్కింగ్ స్థలాలు, తాగునీరు తదితర ఏర్పాట్లను సమీక్షించారు.

February 25, 2026 / 03:22 PM IST

సాధకులకు పవన్ కళ్యాణ్ అండ.!

KRNL: జనసేన కార్యకర్తలను సాధకులుగా పిలవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు బుధవారం ఆదోని నియోజకవర్గం ఇంఛార్జ్ మల్లప్ప తెలిపారు. ఇప్పటికే 75 మంది సాధకులను నియమించామని, సభ్యత్వం తీసుకున్న వారందరికీ భీమా రక్షణ ఉంటుందని ఆయన వెల్లడించారు. మార్పు కోసం యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.

February 25, 2026 / 03:21 PM IST

రైలు నుంచి జారిపడి వృద్ధురాలు మృతి

TPT: నాయుడుపేట, దొరవారిసత్రం రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న వృద్ధురాలు ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వద్ద ఉన్న తిరుచ్చి టికెట్ ఆధారంగా ఆమెది తమిళనాడుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 25, 2026 / 03:20 PM IST

ఘనంగా ప్రారంభమైన పారా బాడ్మింటన్ పోటీలు

VZM: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 7వ రాష్ట్ర స్థాయి పారా బాడ్మింటన్ పోటీలు బుధవారం స్థానిక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా రోటరీ మాజీ గవర్నర్ డాక్టర్. ఎం. వెంకటేశ్వరరావు హాజరై పోటీలను ప్రారంభించారు. వైకల్యం శరీరానికే తప్పా సంకల్పానికి కాదని దివ్యాంగ క్రీడాకారులు నిరూపిస్తున్నారని అన్నారు.

February 25, 2026 / 03:19 PM IST

‘మీటర్ రీడర్స్‌కు న్యాయం చేయండి’

W.G: విద్యుత్ మీటర్ రీడర్స్‌కు ఎస్ర్కో అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని, విద్యుత్ మీటర్ రీడర్స్‌కు పీఎఫ్, ఇఎస్ఐ అమలు చేయాలని కోరుతూ.. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జేసీకి వినతి పత్రం అందచేశారు. వేతనాల చెల్లింపులో పీఎఫ్, ఇఎస్ఐ అమలులో కాంట్రాక్టర్లు తీవ్ర అవినీతికి పాల్పడుతూ మీటర్ రీడర్స్‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.

February 25, 2026 / 03:18 PM IST

27న నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం

E.G: ఈ నెల 27న నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ బుధవారం తెలిపారు. ఈ సమావేశం ఆరోజు ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. పట్టణాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను ఎజెండా రూపంలో సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సభ్యులు వివిధ శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు.

February 25, 2026 / 03:17 PM IST

ఇంటర్ పరీక్షకు 96.51% హాజరు

SKLM: జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 21,101 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 20,364 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఆర్ఎ ఓ ఆర్. సురేష్ తెలిపారు.మొత్తం 737 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షకు 96.51 శాతం హాజరు నమోదైందని వెల్లడించారు.

February 25, 2026 / 03:16 PM IST

జమ్మలమడుగులో బైక్ దొంగలు అరెస్ట్

KDP: బైక్ దొంగలను అరెస్ట్ చేసి, వారి నుంచి 16 బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని రూరల్ సీఐ భాస్కర్రెడ్డి తెలిపారు. స్థానిక అర్బన్ పోలీస్టేషన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోవెలకుంట రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానంగా ఉన్న వ్యక్తులను పట్టుకుని విచారించామన్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 16 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

February 25, 2026 / 03:14 PM IST

తడి-పొడి చెత్త గురించి విద్యార్థులకు అవగాహన

కృష్ణా: మచిలీపట్నం 45వ డివిజన్ నారాయణ స్కూల్ విద్యార్థులకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గోపాల్ రావు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుండి విద్యార్థులు తడి-పొడి చెత్తపై, ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కలిగి ఉండాలని ఉన్నారు. వ్యర్ధాలను వేరే వేరే రంగుల డబ్బాలలో వేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

February 25, 2026 / 03:05 PM IST

డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తగదు: వినయ్

BPT: వేమూరు స్పెషల్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు వినయ్ రాజు బుధవారం డిమాండ్ చేశారు. రూ.70 వేల పశువులను రూ.1.25 లక్షలకు కొనాలని డ్వాక్రా మహిళలపై ఆయన ఒత్తిడి తెస్తున్నారన్నారు. నిర్దిష్ట వ్యక్తుల వద్దే కొనాలని షరతులు పెట్టడం దారుణమన్నారు. దీనివల్ల పేదలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

February 25, 2026 / 03:05 PM IST

తెలుగు భాషను మరువొద్దు: మంత్రి లోకేష్

PLD: సత్తెనపల్లి సుగాలి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో అసెంబ్లీ లాబీలో మంత్రి లోకేశ్ ముచ్చటించారు. పిల్లలే రాష్ట్ర భవిత అని, చరిత సృష్టించేది మీరేనని ఆయన అన్నారు. కెరీర్ కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటూనే మాతృభాష తెలుగును మరవొద్దని సూచించారు. విదేశాల్లో చదవడం వల్ల మొదట్లో తాను ఇబ్బంది పడ్డానని చెప్పారు. స్కూల్లో భోజనం, బోధన గురించి అడిగి తెలుసుకున్నారు.

February 25, 2026 / 03:05 PM IST

‘ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యం’

KRNL: స్వర్ణాంధ్ర–స్వచ్ఛఆంధ్ర(SASA) కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సందర్శించారు.  సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా “స్వర్ణాంధ్ర – స్వచ్ఛఆంధ్ర (SASA) కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోందన్నారు.

February 25, 2026 / 03:02 PM IST

ప్రాజెక్ట్ నమూనాను పరిశీలించిన సీఎం

ప్రకాశం: సీఎం చంద్రబాబు బుధవారం దోర్నాల మండలంలో వెలిగొండ ప్రాజెక్టు నమూనాను పరిశీలించారు. గిద్దలూరు నియోజకవర్గానికి వెళ్లే నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కంభం, గిద్దలూరు, కొమరోలు మీదుగా కడప జిల్లాలోకి కృష్ణా జలాలు వెళ్తాయని అధికారులు తెలిపారు. నల్లమల అడవిలోని గుండ్ల బ్రహ్మేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాల గురించి సీఎం అధికారులతో చర్చించారు.

February 25, 2026 / 03:02 PM IST