KDP: పోరుమామిళ్లలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న శ్రీ భాగ్యలక్ష్మి పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి డిమాండ్ చేశారు. చదువు పేరుతో తల్లిదండ్రుల నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలను సీజ్ చేయాలని ఆయన కోరారు. గుర్తింపు విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
GNTR: చేబ్రోలు మండలం గుండవరం గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ శంకుస్థాపన మహోత్సవం బుధవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొని, ఆలయ జీర్ణోద్ధారణ పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
BPT: చీరాల బీచ్లో అక్షయ రిసార్ట్స్ సంస్థ ఫోర్ స్టార్ హోటల్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. ఎమ్మెల్యే కొండయ్య ప్రత్యేక కృషితో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని ఆయన కార్యాలయం బుధవారం తెలిపింది. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి పెరగడంతో పాటు చీరాల పర్యాటక రంగానికి కొత్త గుర్తింపు రానుంది. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
ప్రకాశం: 2019-24లో సీఎంగా ఉండుంటే 2021లోనే నీళ్ళు ఇచ్చేవాడినని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి అలాగే ఉదయగిరి, బద్వేల్కు 4 లక్షల 35 వేల ఎకరాల సాగుకు నీళ్లు వచ్చుండేవి. ఆనాటి ముఖ్యమంత్రి దొంగ నాటకాలు ఆడి 2019-24 మధ్య కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని విమర్శించారు.
అన్నమయ్య: పాల డైరీ యాజమాన్యం డైరీ కేంద్రాల వద్ద తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని బుధవారం అన్నమయ్య జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వంగవల రంగారెడ్డి సూచించారు. బుధవారం లక్కిరెడ్డిపల్లి ప్రాంతంలోని పాల డైరీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. డైరీలో భద్రతా ప్రమాణాలు నిర్లక్ష్యం చేస్తే రాజమండ్రిలో జరిగినట్లుగా సంఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సత్యసాయి: పుట్టపర్తిలో ఖిద్మత్ ఎ ఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు ఒంటరి మహిళలకు అడిషనల్ ఎస్పీ అంకిత సురాన కుట్టు మిషన్లు అందజేశారు. పద్మావతి, హరిత, అరుణమ్మ అనే మహిళల కుటుంబ పరిస్థితులను గమనించి ఈ సాయం చేశారు. ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అమోఘమని అడిషనల్ ఎస్పీ కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవలు కొనసాగించాలని కోరారు.
KRNL: రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో సర్పంచ్, MPTC స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆలూరు MLA విరుపాక్షి ఇవాళ సూచించారు. హొళగుందలో వైసీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. హొళగుంద ప్రజలు YCP పార్టీకి మెజారిటీ ఇస్తూ ఆదరిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో త్రాగునీరు, రహదారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీ వద్ద రైతాంగ సమస్యలపై చేస్తున్న సామూహిక అధ్యక్షులు బుధవారం 6వ రోజుకు చేరాయి. శిబిరంలోని దీక్షాపరులకు గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి మద్దతు తెలిపి తమ సంఘీభావం తెలిపారు. నియోజకవర్గంలోని చెరువులకు హంద్రీనీవా సాగునీటి జలాల సాధనే ప్రధాన లక్ష్యం అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
PPM: జిల్లాలోని ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడాల్సిన ప్రాథమిక బాధ్యత తహసీల్దార్లదేనని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం రెవిన్యూ అధికారులకు ఉండే సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ప్రతీ సమస్యను సావధానంగా పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురైతే చూస్తూ ఊరుకోకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
కోనసీమలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం వివిధ సేవల ద్వారా రూ.2.68 లక్షలు ఆదాయం లభించిందని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఉదయం నుండి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం చేసుకున్న భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరించారు.
ASR: ఈనెల 26వ తేదీన అనంతగిరిలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ అరకు నియోజకవర్గ ఇంఛార్జ్ సియ్యారి దొన్నుదొర బుధవారం అన్నారు. ఉదయం 10:30కు ప్రారంభమయ్యే ప్రజా వేదికకు 24 పంచాయితీల ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో సమర్పించవచ్చన్నారు. గ్రీవెన్స్కు వచ్చే వారంతా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలన్నారు.
VZM: వంగర మండలంలో ఈ నెల 28నే NTR భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు MPDO రాజారావు బుధవారం తెలిపారు. ఈ మేరకు మండలానికి 290 పెన్షన్లు విడుదల చేయగా రూ.2,67,64500 మంజూరైనట్లు పేర్కొన్నారు. అదేరోజు శతశాతం పింఛన్ పంపిణీ పూర్తిచేయాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. టెంపరరీ మైగ్రేషన్ అయిన వారికి సమాచారం అందించి ఇంటీ దగ్గర ఉండేటట్లు చూసుకోవాలన్నారు.
అనకాపల్లి సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మార్చి 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు చేసే రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని కోరుతూ గోడపత్రికలు విడుదల చేశారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ,బీసీ మహిళ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్ర డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి ఒకే ఒక మహిళా వసతి గృహం ఉందన్నారు.
W.G. మొగల్తూరు కుక్కలవారితోటలో బుధవారం విచారకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటికి రంగులు వేసే పనుల్లో భాగంగా చెద పట్టకుండా స్ప్రే చేస్తున్న సమయంలో ప్లాస్టిక్ మందు క్యాన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడే పనిచేస్తున్న వనం రాజేష్, వనం నారాయణ రావులకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం నిమిత్తం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా: గుడివాడ మండలం బొమ్ములూరు గంగానమ్మ గుడి సమీపంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్సై చంటిబాబు కోడిపందాల స్థావరంపై బుధవారం దాడి చేశారు. ఈ సందర్భంగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి ఒక కోడిపుంజు, కోడి కత్తి, రూ.1200 నగదు రెండు బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.