పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెంలో ఈరోజు ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన దెయ్యాల సూర్యనారాయణ అనే వ్యక్తి తన ఇంటిలో నిద్రిస్తుండగా, ఉదయం 6 గంటలకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గోడ దూకి కత్తితో హత్యచేసి పరారయ్యాడు. రూరల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.