• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పూతలపట్టులో బ్రిడ్జ్‌లు నిర్మించండి: ఎమ్మెల్యే

CTR: పూతలపట్టులో బ్రిడ్జిలు లేక పలువురు మృతి చెందినట్లు ఎమ్మెల్యే మురళీ మోహన్ అసెంబ్లీలో తెలిపారు. భీమా నదిపై బ్రిడ్జి కొట్టుకెళ్లగా, పలు ప్రాంతాల్లో రిపేర్లు చేసిన బ్రిడ్జిలు వర్షాలకు దెబ్బతింటున్నాయన్నారు. ఐరాల MRO కార్యాలయం వద్ద బ్రిడ్జి లేక ప్రమాదాలు జరుగుతున్నాయని, జయంతి-టేకుమంద, యాదమరి మండలం వరదరాజుపల్లిలో కొత్త బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు.

February 25, 2026 / 01:05 PM IST

అగ్రహారం గ్రామంలో కొత్త పార్టీ కమిటీ

KRNL: ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు గోనెగండ్ల మండలం అగ్రహారం గ్రామానికి సంబంధించిన కొత్త గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. అగ్రహారం స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసి కమిటీని ఇంఛార్జ్‌కు బుధవారం అందజేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం, అభివృద్ధి కోసం ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని నాయకులు పేర్కొన్నారు.

February 25, 2026 / 01:03 PM IST

అదనపు కోర్టుల ఏర్పాటుకు ఎమ్మెల్యే విజ్ఞప్తి

KRNL: ఎమ్మిగనూరులో అదనపు న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో కోరారు. మంత్రాలయం, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు మండలాల కేసులు పెరగడంతో సత్వర న్యాయం అందడం లేదని పేర్కొన్నారు. హైకోర్టు అదనపు సివిల్ జడ్జి, సీనియర్ డివిజన్ కోర్టులకు అనుమతి ఇచ్చినప్పటికీ నిధులు కేటాయించలేదని ఎమ్మెల్యే వివరించారు.

February 25, 2026 / 01:00 PM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

అన్నమయ్య జిల్లాలో ఇంటర్ పరీక్షల భద్రతను ఎస్పీ ధీరజ్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. రాయచోటి జూనియర్ కళాశాల, సంబేపల్లి గురుకుల కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, 144 సెక్షన్ అమలును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద అపరిచిత వ్యక్తులు ఉండరాదని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.

February 25, 2026 / 01:00 PM IST

అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయాలి: టీసీ వరుణ్

ATP: జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కడపలో నిర్వహించిన భారీ ఆత్మీయ సమావేశంలో ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు, అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాబోయే రెండు వారాల సమయాన్ని సద్వినియోగం చేసుకుని అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయాలని కోరారు.

February 25, 2026 / 01:00 PM IST

ఏలూరులో బ్రాందీ షాపు వద్దంటూ నిరసన

ఏలూరు 1 టౌన్ పరిధి చిరంజీవి బస్టాండ్ దగ్గర తమ ఇళ్ళ మధ్య బ్రాందీషాపు పెట్టవద్దంటూ స్థానికులు బుధవారం నిరసన చేపట్టారు. గత కొద్దిరోజులుగా ఆషాపులో మధ్యం దుకాణం తెరువబోతున్నారని తెలిసి బ్యానర్లతో మా పరిసర ప్రాంతాల్లో మద్యం షాపు పెట్టకూడదంటూ ధర్నాకి దిగారు. బ్రాందీ షాపు తొలగించేంతవరకు ఊరుకునేది లేదని స్దానిక మహిళలు అన్నారు.

February 25, 2026 / 01:00 PM IST

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సీఐ

కోనసీమ: యువత మాదకద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ అన్నారు. అమలాపురం రూరల్ సమనస గ్రామంలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో బుధవారం మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐ పాల్గొని మాట్లాడుతూ… యువత వ్యసనాలకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.

February 25, 2026 / 01:00 PM IST

గిద్దలూరులో 2వ రోజు అంగన్వాడీల రిలే దీక్షలు

ప్రకాశం: గిద్దలూరులో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీడీపీఓ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు బుధవారం రెండోరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కనీసవేతనం రూ. 26 వేలు అమలుచేయడం, వేతనంతో కూడిన వేసవి సెలవులు, మినీ అంగన్వాడీలను మెయిన్ వర్కర్లుగా గుర్తించడం, 4 లేబర్ కోడ్ల రద్దు తదితర డిమాండ్లు చేశారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు.

February 25, 2026 / 12:54 PM IST

‘తారకరామ ఎత్తిపోతలకు నిధులు విడుదల చేయాలి’

NTR: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతమైన మైలవరం నియోజకవర్గానికి సాగునీటి వరప్రదాయిని తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మెట్ట ప్రాంత రైతులందరూ ఈ పథకం పైనే ఆధారపడి పంటలను సాగుచేసుకుంటున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

February 25, 2026 / 12:45 PM IST

ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి: ఎమ్మెల్యే

ASR: తిమ్మాపురం నుంచి భీమిలి బీచ్ వరకు ఉన్న ప్రాంతాన్ని CRZ-3 నుంచి CRZ-2కు మార్చాలని విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అసెంబ్లీలో కోరారు. CRZ-2కు మార్చకపోతే పర్యాటక అభివృద్ధి కష్టమవుతుందన్నారు. అలాగే 2014లో కేటాయించిన భూమిలో ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 12:45 PM IST

మృతురాలి కుటుంబానికి ఎంపీ ఆర్థిక సాయం

KDP: నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో మట్టి మిద్దె కూలి లక్ష్మిదేవమ్మ మృతికి నివాళులు అర్పించి, నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి పంపిన రూ.10 వేల నగదును టీడీపీ నాయకులు బుధవారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 25, 2026 / 12:45 PM IST

పుంగనూరులో అంగన్వాడి కార్యకర్తలు నిరసన

CTR: తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలని అంగన్వాడి కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం పుంగనూరులోని ICDS ప్రాజెక్టు కార్యాలయం వద్ద బైఠాయించి తమ నీరస తెలిపారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, పని గంటలు తగ్గించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 12:43 PM IST

‘జనసేన సభ్యత్వం విజయవంత చేయాలి’

 ప్రకాశం: రేపటి నుంచి 12 రోజులపాటు జరిగే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎర్రగొండపాలెం జనసేన నాయకుడు పాకనాటి పృథ్వీరాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలకు అండగా ఉండడమే పవన్ ఆశయమని, సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు పార్టీ తరఫున ప్రమాద బీమా రక్షణగా ఉంటుందన్నారు.

February 25, 2026 / 12:42 PM IST

సర్వేలను వేగవంతం చేయాలి: ఎంపీడీవో

బాపట్ల: కర్లపాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో జరుగుతున్న సర్వేలను వేగవంతం చేయాలని ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు ఆదేశించారు. ఆయన చింతాయపాలెం, కర్లపాలెం పంచాయతీల్లో బుధవారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేల తీరును పరిశీలించారు. సర్వేల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా పంచాయతీ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.

February 25, 2026 / 12:37 PM IST

రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ లైన్‌మెన్ మృతి

PLD: నకరికల్లు మండలం అడ్డరోడ్డు వారిగూడెం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజారావు అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. గుండుపల్లి గ్రామంలో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న ఆయన, విధులకు వెళ్తుండగా బైక్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. రాజారావు మరణవార్తతో నకరికల్లు విద్యుత్ శాఖలో మరియు ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది.

February 25, 2026 / 12:36 PM IST