కోనసీమ: రామచంద్రపురం క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఇళ్ల స్థలాలు, వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డులు తదితర సమస్యలపై 48 అర్జీలు అందించారు. మంత్రి వాటిని శ్రద్ధగా స్వీకరించి, అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చూస్తానన్నారు.