PPM: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం తీపి కబురు అందించిందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం అమలు చేస్తున్న ‘వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్’ (JHS)ను మరో ఏడాది పాటు, అంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.