• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఆస్తి నష్టం

ATP: గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో రామాంజనేయులు అనే వ్యక్తి ఇంట్లో మంగళవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లో బీరువాలో ఉన్న రూ.2.30 లక్షల నగదు, నిత్యవసర సరుకులు మంటల్లో ఖాళీ పూర్తయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు బుధవారం విచారణ చేపట్టారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వాపోయాడు.

February 25, 2026 / 09:20 AM IST

చిన్నారి ప్రాణం కాపాడేందుకు ఎమ్మెల్యే చొరవ

BPT: గుండె సమస్యతో బాధపడుతున్న ఇంకొల్లు మండలానికి చెందిన శిశువు చికిత్స కోసం మంగళవారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు భారీ సాయం అందించారు. సొంత నిధుల నుంచి రూ. 50 వేలు ఇవ్వడంతోపాటు, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ. 3.02 లక్షల ఎల్ఓసిని మంజూరు చేయించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సహకారంతో గుంటూరులోని ఆసుపత్రిలో చిన్నారికి అత్యవసర చికిత్స కొనసాగుతోంది.

February 25, 2026 / 09:20 AM IST

మార్చి 5న విశ్రాంత ఉద్యోగుల సమావేశం

TPT: తితిదే విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మార్చి 5న ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు రెడ్డివారి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. దేవస్థానం పరిపాలన కార్యాలయ ఆవరణలో జరిగే ఈ సమావేశానికి విశ్రాంత ఉద్యోగులు హాజరుకావాలని ఆయన కోరారు.

February 25, 2026 / 09:20 AM IST

ఈనెల 28న పింఛన్ పంపిణీ

కృష్ణా: మార్చి నెల పెన్షన్లను ఈనెల 28వ తేదీన పంపిణీ చేయనున్నట్లు మొవ్వ MPDO డి. సుహాసిని తెలిపారు. ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 28వ తేదీన ముందుగానే అందజేయనున్నట్లు ఆమె చెప్పారు. NTR భరోసా పింఛన్ పథకం కింద మండలంలో 8,315 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 3,59,83,500 నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

February 25, 2026 / 09:15 AM IST

రాంబిల్లిలో గ్రీన్ ఫీల్డ్ లిథియం కంపెనీ

VSP: రాంబిల్లి మండలంలో గ్రీన్ ఫీల్డ్ లిథియం కంపెనీ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఏర్పాటు చేసే బాలాజీ యాక్షన్ బిల్డ్ వేస్‌కు ప్రోత్సాహకాలు అందిస్తారు. రూ.8,175 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే కంపెనీలో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

February 25, 2026 / 09:15 AM IST

విజయవంతంగా వైసీపీ సంస్థాగత నిర్మాణ కమిటీ సమావేశం

NTR: ఇబ్రహీంపట్నం మండలం ములపాడు గ్రామంలో వైసీపీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మాజీమంత్రి యోగి రమేష్ మాట్లాడుతూ.. వైసీపీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసి, పార్టీని గ్రామస్థాయి వరకు మరింత శక్తివంతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

February 25, 2026 / 09:10 AM IST

రాజాం జాతరలో అపశృతి

PPM: రాజాం శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ముగింపు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి నిర్వహించిన బాణసంచా ప్రదర్శనలో డోలపేట గ్రామానికి చెందిన శ్రీదేవికి తీవ్ర గాయాలయ్యాయి. బాణసంచా పేలుస్తున్న సమయంలో ఒక ఔట్ బాక్స్ నేరుగా వచ్చి ఆమెకు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

February 25, 2026 / 09:08 AM IST

టీనేజ్ ప్రెగ్నెన్సీపై అవగాహన కార్యక్రమం

KDP: సింహాద్రిపురం మండలం కోవరంగుంటపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయ డిప్యూటీ డెమో ఆఫీసర్ ప్రసన్న లత విద్యార్ధినీలకు టీనేజ్ ప్రెగ్నెన్సీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల తక్కువ బరువు గల శిశువులకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు. టీనేజ్ పిల్లల ముందు తల్లిదండ్రులు కొన్ని అలవాట్లు మానుకోవాలని తెలిపారు.

February 25, 2026 / 09:07 AM IST

నేడు పలు గ్రామాలకు విద్యుత్ కట్

VZM: బొబ్బిలి మండలం పెంట విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే రంగరాయపురం ఫీడర్ నిర్వహణ పనులు కోసం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బి.రఘు చెప్పారు. రంగరాయపురం, జె.రంగరాయపురం, చెల్లారపువలస, ఎం.బూర్జవలస గ్రామాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.

February 25, 2026 / 09:07 AM IST

శ్రీవారి సేవలో మాజీ మంత్రి రోజా

TPT: తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమెకు రంగనాయకులు మండపంలో వేద పండితులు ఆశీర్వచనంతో అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

February 25, 2026 / 09:05 AM IST

నరసాపురం గ్రంథాలయంలో ఆకస్మిక తనిఖీ

నరసాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయాన్ని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్ బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠకులతో ముఖాముఖి నిర్వహించి గ్రంథాలయంలో అందుతున్న సేవలు, ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.

February 25, 2026 / 09:04 AM IST

ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి: కమిషనర్

KRNL: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయడానికి రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ పీ.విశ్వనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.

February 25, 2026 / 09:03 AM IST

పేదింటి పెళ్లికి కేశవరెడ్డి ఆర్థిక సాయం

ATP: గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్ఎస్ నివాసి చంద్రశేఖర్ కుమార్తె వివాహానికి ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి బుధవారం 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబానికి నగదును అందజేసి వధూవరులను ఆశీర్వదించారు. వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆయన ఆకాంక్షించారు.

February 25, 2026 / 09:00 AM IST

’27న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం’

NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 27వ తేదీన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుజాత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూత్ రెడ్ క్రాస్ కమిటీ, బొల్లినేని హాస్పిటల్ వారి సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఉచితంగా మందులు అందజేస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు.

February 25, 2026 / 09:00 AM IST

క్రమశిక్షణకు ప్రతీక రంజాన్: మాజీ ఎమ్మెల్యే

అన్నమయ్య: రాయచోటిలోని పాతిమా మసీదులో YCP మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ MLA శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రంజాన్ ఆధ్యాత్మికతతో పాటు క్రమశిక్షణ,సేవాభావం పెంపొందిస్తుందని కొనియాడారు. దైవచింతన వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు.

February 25, 2026 / 09:00 AM IST