KRNL: కడప జిల్లా ఖాజీపేటలో యువతి హత్యపై శుక్రవారం మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొంతు కోసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. నిందితుడి వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కాగా తనను పెళ్లి చేసుకోలేదని యువతిని దారుణంగా శ్రీనివాస్ గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే.
VZM: సీతం కళాశాలలో ఏప్రిల్ 4 నుంచి నిర్వహిస్తున్న ఉచిత పోలిసెట్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా.. ఇవాళ విద్యార్థులకు పోలిసెట్కు సంబంధించిన స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బొత్స అనూష హాజరయ్యారు. సంస్థ అందిస్తున్న ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ELR: గోదావరి నదిపై రుద్రంకోట – కూనవరం మధ్య ప్రయాణికులను చేరవేసే ఫెర్రీ నిర్వహణ హక్కులకు శుక్రవారం భారీ ధర పలికింది. కూనవరం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ వేలంలో తెల్లపల్లికి చెందిన రాజమ్మ రూ. 89.30 లక్షలకు పాట పాడి హక్కులను దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈసారి ప్రభుత్వానికి రూ. 10.70 లక్షల అదనపు ఆదాయం లభించింది.
AKP: పరవాడ పీహెచ్సీ వద్ద ఇవాళ పోషణ పక్వాడ సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. పిల్లల మెదడు అభివృద్ధి తొలి రెండేళ్లలోనే ఎక్కువగా జరుగుతుందని సూపర్వైజర్ శ్యామల కుమారి తెలిపారు. సెల్ఫోన్లకు దూరంగా ఉంచి పుస్తకాలు, కథలు అలవాటు చేయాలని సూచించారు. జంక్ ఫుడ్కు బదులుగా ఇంటి ఆహారం ఇవ్వాలని వైద్యాధికారి కరిష్మా అన్నారు.
W.G: అత్తిలి మండలం పాలూరులో ఏకలవ్య సంఘం 12వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంఘానికి చెందిన 12 మంది విద్యార్థులకు రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు గ్రామ సహకార సంఘం మాజీ అధ్యక్షుడు అల్లూరి రామకృష్ణంరాజు తెలిపారు. ఈ విద్యార్థుల్లో పదో తరగతి నుండి ఎంబీఏ చదివే విద్యార్థులు ఉన్నారని తెలిపారు.
NDL: రాష్ట్ర సచివాలయ కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడిని శుక్రవారం టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై సంక్షిప్తంగా చర్చించినట్లు సమాచారం. సీఎం నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసి ఉన్న చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ నెల్లూరు పట్టణానికి చెందిన హరిప్రసాద్ కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు వారు రూ. 50,116 ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను ఇచ్చారు.
KRNL: ఐదేళ్లలో హంద్రీనీవాకు వైసీపీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని శుక్రవారం మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ‘మీ కడుపు మంటకు మందులు పంపిస్తాం.. వాడుకోండి. బొత్స చెప్పిన మాటలను అచ్చెన్న గుర్తు చేశారు. మీరు చెప్పిన మాటలను గుర్తు చేస్తే ఉలుకెందుకు?. భయంలో నుంచి బొత్సకు బాధ పుట్టుకొచ్చిందేమో?. జగన్ నైజాన్ని చూసి.. బొత్స బాధపడకపోతే ఏం చేస్తారని అన్నారు.
SKLM: జిల్లాలో చారిత్రక సమస్యలకు శాశ్వత పరిష్కారం తమ హయాంలో పరిష్కారం అవుతునందుకు ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇవాళ జిల్లాలోని మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కానీ నేరేడు బ్యారేజ్ సమస్యను పరిష్కరించామని, జులై 5న భోగాపురం ప్రారంభోత్సవానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
VSP: ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ఆధ్వర్యంలో సిబ్బందికి ఇవాళ మద్దిలపాలెం డిపోలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సిబ్బందికి వైద్య బృందాలు శిక్షణ ఇచ్చాయి. ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ అందించి 108 ద్వారా చికిత్సకు తరలించాలని తెలిపారు.
కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ప్రతి శుక్రవారం మెన్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో పలువురు సిబ్బంది స్వయంగా ఎస్పీని కలిసి తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. వాటిపై ఎస్పీ సానుకూలంగా స్పందించారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే సిబ్బంది ఉద్యోగపరంగా లేదా వ్యక్తిగతంగా ఏ సమస్య అయినా నేరుగా దరఖాస్తు చేయవచ్చన్నారు.
కోనసీమ: సోలార్ విద్యుదీకరణ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు. పి.గన్నవరం మండలం ఊడిమూడి గ్రామంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని ఎమ్మెల్యే ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు అందరూ పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ATP: గార్లదిన్నె మండలంలోని దక్షిణ ప్రాంత వ్యవసాయ యంత్రాల శిక్షణ, పరీక్షణ సంస్థను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థలోని డ్రోన్ ప్రయోగశాల, టెస్టింగ్ ల్యాబ్లు, అత్యాధునిక వ్యవసాయ పరికరాలను ఆయన పరిశీలించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన శిక్షణార్థులు, స్థానిక రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
SS: జలధార-జలహారతి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని చెరువులు, కాలువలను త్వరితగతిన బాగు చేయాలన్నారు. మొబైల్ యాప్ వినియోగిస్తూ ప్రతి చెరువులోకి నీరు చేరేలా చూడాలన్నారు.
BPT: గోవాడ మహాశివరాత్రి పరిరక్షణసమితి రేపల్లె ఆర్డీవో కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. తెనాలి నుంచి పెద్ద సంఖ్యలో కమిటీ సభ్యులు అక్కడకు వెళ్లి స్థానిక సభ్యులతో కలిసి ఆందోళన చేశారు. గోవాడ ఆలయ సమీప పొలాల్లో ఎంఎయంఈ పార్క్ నిర్మాణం నిలిపివేయాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అమృతలూరు MROపైచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.