• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మురుగు కూపంలో మూడు రోడ్ల కూడలి

E.G: దేవరపల్లి-గోపాలపురం మూడు రోడ్ల సెంటర్ వద్ద డ్రైనేజీ ఆక్రమణలతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. దుర్వాసనతో ప్రయాణికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నామమాత్రపు పనులు కాకుండా, ఆక్రమణలు తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరారు. మురుగునీటి సమస్యతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

February 25, 2026 / 09:00 AM IST

కుమార్తెను హత్య చేసిన తల్లి

TPT: తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన ఆశాల భర్తతో విడిపోయి తన కుమార్తె దుర్గతో కలిసి ఉంటుంది. చెన్నంపల్లికి చెందిన రెడ్డి కుమార్‌తో సహజీవనం చేస్తుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుని అడ్డుగా ఉన్న కుమార్తెను చంపేశారు. మృతదేహాన్ని స్వర్ణముఖి నది దగ్గర పూడ్చిపెట్టారు. తన బిడ్డ, మనవరాలు కనబడుటలేదని ఆశాలత తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

February 25, 2026 / 08:58 AM IST

ప్రశాంతి నిలయంలో ‘బాయ్ తీ కాంగ్’ వేడుకలు

సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో చైనా నూతన సంవత్సర ముగింపు వేడుకల సందర్భంగా బుధవారం తెల్లవారుజామున ‘బాయ్ తీ కాంగ్’ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జేడ్ చక్రవర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని చైనా భక్తులు ఈ సంప్రదాయ వేడుకను జరుపుకున్నారు. ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బియ్యం కేకులు, అగరుబత్తులు, దీపాలతో ప్రత్యేక పూజలు చేశారు.

February 25, 2026 / 08:56 AM IST

నియోజకవర్గ అభివృద్ధిపై లోకేశ్‌తో ఎమ్మెల్యే దాట్ల చర్చ

కోనసీమ: మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు ముమ్మిడివరం MLA దాట్ల సుబ్బరాజు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌లతో కూడిన ప్రత్యేక పెయింటింగ్‌ను MLA కుటుంబ సభ్యులు మంత్రికి అందజేశారు. లోకేశ్ అందరినీ పేరుపేరునా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు.

February 25, 2026 / 08:50 AM IST

మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్..!

CTR: బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్‌ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయన్ని సీఐ కత్తి శ్రీనివాసరావు తెలిపారు. పాలేరు గ్రామానికి చెందిన గిరిజ(51) అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా 25 మందు బాటిల్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

February 25, 2026 / 08:49 AM IST

చీరాలలో ఎమ్మెల్యే వర్గీయుల నిరసన

BPT: చీరాల ఎమ్మెల్యే కొండయ్యపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆరోపిస్తూ కూటమి శ్రేణులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఆర్ఓబీ (ROB) నిర్మాణంపై వాస్తవాలను వక్రీకరించారని మండిపడుతూ సాక్షి పత్రిక ప్రతులను చించివేశారు. 2014-19 మధ్యే అనుమతులు వచ్చినా, ఆ తర్వాతి నిర్లక్ష్యం వల్లే పనులు ఆగిపోయాయని,ప్రజల సమస్యల కోసమే ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడారని తెలిపారు.

February 25, 2026 / 08:45 AM IST

విశాఖ ట్రాఫిక్‌కు స్మార్ట్ టెక్నాలజీ అండ

VSP: విశాఖలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జీవీఎంసీ ‘ప్రాజెక్టు సారథి’ని అమల్లోకి తెచ్చింది. 101 సిగ్నళ్లను సిటీ ఆపరేషన్ సెంటర్‌కు అనుసంధానిస్తూ అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌ను ప్రవేశపెడుతున్నారు. 90 కీలక జంక్షన్లలో ఏఐ ఆధారిత ఐటీఎంఎస్ ఏర్పాటు చేసి హెల్మెట్ లేకపోవడం, సిగ్నల్ జంప్ వంటి ఉల్లంఘనలను గుర్తించి ఆటోమేటిక్‌గా చలానాలు పంపించనున్నాయి.

February 25, 2026 / 08:42 AM IST

అటవీ పరిరక్షణకు కలెక్టర్ ఆదేశాలు

KDP: ప్రొద్దుటూరు రాజీవ్ గాంధీ నేషనల్ ఏకో పార్క్, రిజర్వ్ ఫారెస్ట్ పరిరక్షణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కడపలో జరిగిన అటవీ పరిరక్షణ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని జాతీయ పార్కు, రక్షిత అడవి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల చుట్టూ ఏకో-సెన్సిటివ్ జోన్ అమలుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు.

February 25, 2026 / 08:41 AM IST

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

కృష్ణా: నందివాడ విద్యుత్తు సబ్‌స్టేషన్ పరిధిలో బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. నూతన ఆర్‌డీఎస్‌ఎస్ విద్యుత్తు లైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు తుమ్మలపల్లి, తమిరిశ గ్రామాలతో పాటు నందివాడ ప్రాంతంలో సరఫరా ఉండదని వెల్లడించారు.

February 25, 2026 / 08:40 AM IST

బెల్లం ప్రత్యేక అలంకరణలో స్వయంభు జంబుకేశ్వరుడు

ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసిద్ధ శ్రీ స్వయంభు జంబుకేశ్వరుడు బెల్లం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు. బుధవారం వేకువ జామునే స్వామి మూల విరాట్‌కు పంచామృత, రుద్రాభిషేకం వివిధ అభిషేకాలు చేపట్టి బెల్లంతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్వామివారి విశేష అలంకరణను భక్తులు దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు.

February 25, 2026 / 08:40 AM IST

ఎస్పీ అధ్యక్షతన క్రైమ్ రివ్యూ మీటింగ్

NDL: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సునీల్ షౌరాణ్ పోలీసు అధికారులతో మంగళవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

February 25, 2026 / 08:36 AM IST

సీఎం చంద్రబాబు పర్యటనలో 1200 మందితో భారీ భద్రత

ప్రకాశం: మార్కాపురం జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో, ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ.. దాదాపు 1200 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీ బందోబస్త్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాస్లు ఉన్నవారు మాత్రమే సీఎం కార్యక్రమంలో పాల్గొనాలని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

February 25, 2026 / 08:36 AM IST

దివ్యాంగ విద్యార్థికి పరీక్ష కేంద్రంలో ఇబ్బందులు

AKP: కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ర్యాంపు, వీల్ఫైర్ వంటి మౌలిక సదుపాయాలు లేక తీవ్ర అవస్థలు ఎదురయ్యాయి. తోటకూరపాలెం నుంచి 20 కి.మీ. దూరం ప్రయాణించి వచ్చిన గూనూరు ఆదిలక్ష్మిని ఆమె తల్లి వెంకటలక్ష్మి ఎత్తుకొని పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లారు. మెట్లు ఎక్కాల్సి రావడంతో మరింత ఇబ్బంది పడింది.

February 25, 2026 / 08:32 AM IST

శ్రీకాకుళంలో 76 డయేరియా కేసులు

SKLM: శ్రీకాకుళంలోని డయేరియా కేసులు 76కి చేరడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. బాధితుల కోసం రిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు కల్పించారు. ప్రభావిత కాలనీల్లో 50 సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాయి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. తాగునీరు మరిగించి తాగాలని వైద్యులు సూచించారు.

February 25, 2026 / 08:31 AM IST

గన్నవరం రైతు బజార్‌లో నేటి కూరగాయల ధరలు

కృష్ణా: గన్నవరం రైతు బజార్‌లో బుధవారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట రూ.14, వంకాయ రూ. 18-20, పచ్చిమిర్చి రూ. 38, కాకర రూ. 32, బీర రూ. 24గా ఉన్నాయి. ఫ్రెంచ్ బీన్స్ రూ. 53, క్యాప్సికం రూ. 59, కీర దోస రూ. 41, చింతకాయలు రూ. 65గా అమ్ముడవుతున్నాయి. కాలిఫ్లవర్ ఒక్కటి రూ.15–20, కాబేజీ రూ.15, క్యారెట్ రూ.27, బంగాళాదుంప రూ.22, ఉల్లిపాయలు రూ. 23గా విక్రయిస్తున్నారు.

February 25, 2026 / 08:24 AM IST