W.G: తాడేపల్లిగూడెంలో తాటి ముంజెలకు భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా పశ్చిమలో ముంజెలకు మే మొదటి వారంలో మార్కెట్కు అమ్మకానికి వస్తాయి. కానీ ఈ ఏడాది నెల రోజుల ముందు గానే తాటి మంజులు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. అయితే వీటి ధర అదరహో అన్నట్లుగా ఉంది. డజను ముంజెలు రూ.80 వరకు పలుకుతున్నాయి. అయినా వీటిని కొనేందుకు వినియోగదారులు ఎగబడుతున్నారు.