మార్కాపురం పట్టణంలోని ఓ హోటల్లో పేకాట ఆడుతున్న 17 మందిని శనివారం స్థానిక పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.63,750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.