TPT: తిరుపతి స్విమ్స్ అన్న క్యాంటీన్ వద్ద ఓ వ్యక్తి చనిపోయి ఉండటాన్ని పోలీసులు బుధవారం గుర్తించారు. మృతుని జేబులో లభించిన వికలాంగుల ఆర్టీసీ బస్సు పాస్ ఆధారంగా అతను అన్నమయ్య జిల్లా గాలివీడు ప్రాంతానికి చెందిన పి.పెంచలయ్యగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. ఎవరైనా గుర్తిస్తే తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ను సంప్దించాలని పోలీసులు కోరారు.