• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ఈనెల 21వ తేదీ లోపు కుటుంబ సర్వే పూర్తి చేయాలి’

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏకీకృత కుటుంబ సర్వేను ఈనెల 21వ తేదీ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 96,150 కుటుంబాలకు సర్వే నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలియజేశారు.

February 26, 2026 / 01:15 PM IST

మార్కాపురం ఆర్డీవోగా ప్రభాకర్

ప్రకాశం: మార్కాపురం రెవెన్యూ డివిజన్ (ఆర్డీవో)గా పెంచల ప్రభాకర్ నేడు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆయన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీవో ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి రెవెన్యూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

February 26, 2026 / 01:15 PM IST

దుడ్డుకలులో సమ్మర్ క్రాష్ పనులు ప్రారంభం

PPM: దుడ్డుకలు నుంచి బీరుపాడు వరకు  గ్రామస్థులు సమ్మర్ క్రాష్ ప్రోగ్రాంను ఇవాళ MPDO శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పనులు చేపట్టారు.పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. చేతి పంపుల మరమ్మతులు, పైపులైన్ పరిశీలన, నీటి వనరుల శుద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. వేసవిలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నమన్నారు.

February 26, 2026 / 01:15 PM IST

తెలుగు గంగ కాలువకు గండి

NDL: బండిఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామ శివారులో ఉన్న తెలుగు గంగ ప్రధాన కాలువకు 4-5 బ్లాకుల మధ్య భారీ గండి పడింది. దీంతో సాగునీరు వృథాగా ప్రవహిస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని నీటి ప్రవాహాన్ని తగ్గించారు. ఇటీవలే సమీపంలో గండి పూడ్చినప్పటికీ మళ్లీ గండి పడటంపై అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

February 26, 2026 / 01:13 PM IST

సూళ్లూరుపేటలో బాలికలకు అవగాహన

TPT: సూళ్లూరుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మురళీకృష్ణ, ఎస్సై అజయ్ కుమార్ హాజరై ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్ మోసాలు, వాటి నుంచి రక్షణ మార్గాలపై సూచనలు ఇచ్చారు. “గుడ్ టచ్–బ్యాడ్ టచ్”, వాహన భద్రత, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే శక్తి యాప్‌ గురించి వివరించారు.

February 26, 2026 / 01:12 PM IST

కనిగిరిలో 30% ఐఆర్ కోసం ఏటీపీఎఫ్ నిరసన

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు 30 శాతం ఇంటిరిమ్ రిలీఫ్ (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కనిగిరిలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే 30% ఐఆర్ ప్రకటించాలని కోరుతూ తహసీల్దార్‌కు నేతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.

February 26, 2026 / 01:10 PM IST

సుంకం టెండర్ రద్దు చేయాలని ధర్నా

ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు, చిన్న వ్యాపార సంఘం కార్యదర్శి తిమ్మప్ప మాట్లాడుతూ.. చిన్న వ్యాపారస్తుల కడుపు కొట్టే సుంకం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీని సుంకం గెజిట్ ప్రకారం వసూలు చేయాలన్నారు.

February 26, 2026 / 01:10 PM IST

సబ్ జైలును తనిఖీ చేసిన న్యాయమూర్తి

AKP: నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జి పీ. షియాజ్ ఖాన్ గురువారం స్థానిక సబ్ జైలు‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలకు అందుతున్న ఆహారాన్ని తనిఖీచేసారు. ఖైదీలతో మాట్లాడి సౌకర్యాలు పట్ల ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఖైదీలు ఎవరికైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకుంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

February 26, 2026 / 01:10 PM IST

తిరుపతి జిల్లాలో పరీక్షలకు 454 మంది డుమ్మా

తిరుపతి జిల్లాలో గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా 98 కేంద్రాల్లో 29,470 మంది పరీక్షలు రాయాల్సి ఉంది. 29,016 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 454 మంది పరీక్షలకు రాలేదని చెప్పారు.

February 26, 2026 / 01:07 PM IST

మంత్రి సవితను కలిసిన సందర్శకులు

సత్యసాయి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మంత్రి సవితను గురువారం కలిశారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లో నెలకొన్న వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. మంత్రి సవిత వాటిని సంబంధిత అధికారులతో సమీక్షించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

February 26, 2026 / 01:05 PM IST

హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ: మంత్రి

KDP: విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పబ్లిక్ పరీక్షల సమయంలో హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. ప్రస్తుతం ఇంటర్ ఎగ్జామ్స్ సందర్భంగా విద్యార్థులకు అందుబాటులో ఉండగా, పదవ తరగతి విద్యార్థులకు గత ఏడాది కూడా ఫ్రీ జర్నీ అమలు చేసిన విషయం తెలిసిందే.

February 26, 2026 / 01:05 PM IST

రాజమండ్రి 13వ వార్డులో డ్రైనేజీ నిర్మాణం

EG: రాజమండ్రి 13వ వార్డు తాడితోట అంబేద్కర్ నగర్‌లోని డ్రైనేజీ నిర్మాణ పనులను గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా BJP ఓబీసీ మోర్చా తూ.గో జిల్లా కోశాధికారి పోలవరపు రాము పనులను పరిశీలించారు. డ్రైనేజీ నిర్మాణంలో పనులు వేగవంతం చేసి, నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. డ్రైనేజీ నిర్మాణంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

February 26, 2026 / 01:04 PM IST

ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎంపీ

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామిని గురువారం జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అధికారులు ఎంపీ దంపతులను స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఎంపీ కుటుంబ సభ్యుల పేర్లు పై ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.

February 26, 2026 / 01:03 PM IST

సంతోషంలో సుజాత.. ఒంటరిగా స్రవంతి

NLR: నెల్లూరు కార్పొరేషన్ నూతన మేయర్ ఎన్నిక సందర్భంగా ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఎన్నికకు వైసీపీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మాజీ మేయర్ స్రవంతి ఒంటరిగా, మౌనంగా కూర్చుండిపోయారు. అదే సమయంలో టీడీపీ కార్పొరేటర్లు జోష్ మీద వచ్చారు. నూతన మేయర్‌గా సుజాత ఎన్నికకావడంతో ఆమె సంతోషంగా కనిపించారు.

February 26, 2026 / 01:02 PM IST

VIDEO: మార్చి 1న మండల సర్వసభ్య సమావేశం

ప్రకాశం: పామూరు మండల సర్వసభ్య సమావేశం మార్చి 1 వ తేదీన జరుగుతుందని డిప్యూటీ ఎంపీడీవో షేక్ హజరత్ ఆలీ తెలియజేశారు. ఎంపీపీ గంగసాని లక్ష్మి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని తెలిపారు. మండలంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీ, సర్పంచులు హాజరుకావాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలతో హాజరు కావాలని సూచించారు.

February 26, 2026 / 01:01 PM IST