మార్కాపురం జిల్లా కనిగిరిలో ‘జల ధార-జల హారతి’ పనులపై నిర్లక్ష్యం వహించిన అధికారులను కలెక్టర్ విజయ సునీత హెచ్చరించారు. 6 మండలాల్లోని 134 చెరువుల పనులపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పూడిక తీత పనులను వేగవంతం చేయాలని సూచించారు. త్వరగా పనులు పూర్తి చేస్తే వర్షాకాలంలో చెరువులు నిండుతాయని తెలిపారు.