NLG: వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనా రెండున్నర సంవత్సరాలలో నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేద కుటుంబాల సొంత ఇంటి కలను నెరవేర్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు.