TPT: శెట్టిపల్లి గ్రామంలో శ్రీ చిరాలమ్మ తల్లి 31వ జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా ఆధ్యాత్మిక ఉత్సాహంతో పాటు ఆనందంతో గ్రామస్తులు ఆయనను సన్మానించారు. ఈ వేడుకలో స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.