TPT: సత్యవేడు పట్టణంలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల సొమ్ము పంపిణీ జరగనుంది. టీడీపీ నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఉదయం 9 గంటలకు నేతాజీ రోడ్డు, గాంధీ రోడ్డు ప్రాంతాల్లో లబ్ధిదారులకు పింఛన్లు అందజేయనున్నట్లు మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం సెలవు కారణంగా ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.