PPM: జిల్లాలో రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెరిఫికేషన్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, క్షేత్రస్థాయిలో ప్రతి రికార్డును క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.