ATP: గుత్తిలోని 4 కేంద్రాల్లో సోమవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి సంవత్సరం గణితం పరీక్ష కావడంతో సప్లమెంటరీ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పోలీసులు, కళాశాల సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. సీఐ రామారావు ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.