గుంటూరు: తెనాలికి చెందిన ఇస్కఫ్, సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ, డాక్టర్ అగర్వాల్ ఐ క్లినిక్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నందులపేటలోని సీనియర్ సిటిజన్స్ భవనంలో ఏర్పాటు చేసిన శిబిరానికి మంచి స్పందన లభించింది. శిబిరానికి వచ్చిన పలువురికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వైద్య సలహాలు అందజేశారు.