ఏలూరు జిల్లాలో నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమం ద్వారా చేపట్టవలసిన పనులు, కాల్వలు, చెరువుల వివరాలను సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం నాటికి నీటి వనరులన్నింటినీ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యంతో సిద్ధం చేయాలన్నారు.