కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ గురువారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దర్శనానికి వెళ్తున్న సమయంలో జరిగిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.