SS: పెనుకొండలో కియా, దాని అనుబంధ పరిశ్రమల రాకతో విద్యా వ్యవస్థ రూపురేఖలు మారుతున్నాయి. CSR నిధులతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారు. డిగ్రీ కళాశాలలో రూ.80 లక్షలతో ఆధునిక గ్రంథాలయం నిర్మించి, 18 వేలకు పైగా పుస్తకాలను ఆన్లైన్ చేశారు. ఇది 83 గ్రామాల విద్యార్థులకు వరంలా మారింది.