SKLM: పలాస మండలం మహాదేవిపురంలో విషాదం చోటుచేసుకుంది. జంట హత్యల కేసులో నిందితుడైన మడియా రామారావు (45) తన నివాసంలో ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోంపేట మండలం పాలవలస, మందస మండలం దున్నవూరులలో జరిగిన జంట హత్యలతో ఇతనికి సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.